కనిపించకుండా పెరిగిపోయిన డీజిల్, పెట్రోల్ ధరలు
హైద్రాబాద్, జూన్ 20,
దేశీ ఇంధన ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈరోజు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది వరుసగా 14వ రోజు కావడం గమనార్హం. ఈ కాలంలో పెట్రోల్ ధర లీటరుకు దాదాపు రూ.8 మేర పెరిగింది. హైదరాబాద్లో శనివారం లీటరు పెట్రోల్ ధర 52 పైసలు పెరుగుదలతో రూ.81.88కు, డీజిల్ ధర 60 పైసలు పెరుగుదలతో రూ.75.91కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి.అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 51 పైసలు పెరుగుదలతో రూ.82.27కు చేరింది. డీజిల్ ధర కూడా 57 పైసలు పెరుగుదలతో రూ.76.30కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 51 పైసలు పెరుగుదలతో రూ.81.87కు చేరింది. డీజిల్ ధర కూడా 58 పైసలు పెరుగుదలతో రూ.75.94కు ఎగసింది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 51 పైసలు పెరుగుదలతో రూ.78.88కు చేరింది. డీజిల్ ధర కూడా 61 పైసలు పెరుగుదలతో రూ.77.67కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 49 పైసలు పెరుగుదలతో రూ.85.70కు చేరింది. డీజిల్ ధర కూడా 58 పైసలు పెరుగుదలతో రూ.76.11కు ఎగసింది.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 1.08 శాతం పెరుగుదలతో 41.96 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 1.57 శాతం పెరుగుదలతో 39.45 డాలర్లకు ఎగసింది.ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.