YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 కార్మికులు, వలస కూలీలకు ప్రయోజనం125 రోజుల ఉపాధి

 కార్మికులు, వలస కూలీలకు ప్రయోజనం125 రోజుల ఉపాధి

 కార్మికులు, వలస కూలీలకు ప్రయోజనం125 రోజుల ఉపాధి
న్యూఢిల్లీ, జూన్ 20,
మోదీ సర్కార్ కొత్త స్కీమ్ లాంచ్ చేసింది. దీని ద్వారా చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. రోజు ఉపాధి లభిస్తుంది. దీంతో కార్మికులకు, వలస కూలీలకు బెనిఫిట్ ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన పని కూడా లేదు.కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ తీసుకువచ్చింది. కార్మికులు, వలస కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మోదీ సర్కార్ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దీని పేరు ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్‌గర్ యోజన.కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.50,000 కోట్లు కేటాయించింది. వలస కూలీలు, కార్మికులకు ఎంఎన్ఆర్ఈజీఏ (గ్రామీణ ఉపాధి హామీ పథకం- కరుపు పని) కింద పని లభిస్తుంది. ఇందులో భాగంగా రోజుకు రూ.182 నుంచి రూ.202 సంపాదించొచ్చు.అంటే కేంద్ర ప్రభుత్తం ఈ పథకం కింద 125 రోజులు ఉపాధి కల్పిస్తుంది. అంటే రోజుకు రూ.202 ప్రకారం చూస్తే.. మొత్తంగా రూ.25,250 పొందొచ్చు. పథకంలో భాగంగా కూలీలకు వారి ఊరిలోనే పని లభిస్తుంది. ప్రభుత్వాలు అందించే 25 రకాల స్కీమ్స్‌లో వీరికి ఉపాధి ఉంటుంది.ప్రస్తుతానికి అయితే గరీబ్ కల్యాణ్ రోజ్‌గర్ యోజన స్కీమ్ తొలిగా 6 రాష్ట్రాల్లో అమలులో ఉంటుంది. 116 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తామని మోదీ సర్కార్ తెలిపింది. బీహార్‌లో ప్రధాని మోదీ స్కీమ్‌ను ఆవిష్కరించారు.ఈ పథకంలో చేరడానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవే వలస కూలీలను ఎంపిక చేస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఈ స్కీమ్‌కు గురించి వివరాలను వెల్లడించారు. వలస కూలీలు రూరల్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ పనులు చేస్తారని తెలిపారు.

Related Posts