బడుగు బలహీన వర్గల ఆశాజ్యోతి మహత్మ జ్యోతిబాపులే 192 వ జయంతి వేడుకలను బడుగు బలహీన వర్గాల నేతలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన జయంతి వేడుకల్లో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గోని జయంతి వేడుకల్లో పాల్గోని పూలే చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో మంత్రి ఈటెలతో పాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బుడిగే శోభలతో పాటుగా ఎమ్మెల్సీ నారదాసు పాల్గోని పూలే సేవలను గుర్తు చేశారు. సందర్బంగా కాంగ్రెస్ నాయకులు తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటు పూలే విగ్రహనికి పూల మాల వేసి జయంతి వేడుకల్లో పాల్గోన కుండా వెళ్లి పోయారు. మరోవైపు, రజక కులస్తులు తమకు తగిన ప్రాధాన్యత కల్పించి...తమ సమస్యలు పరిష్కరించాలంటు నిరసన చేపట్టి మంత్రి ఈటెలకు వినతి పత్రం అందచేశారు. దేశంలో అణగారిన ప్రజల బతుకుల బాగు కోసం, హక్కుల కోసం పాటు పడిన గొప్ప మహనీయుడు జ్యోతి బాపూలే అని గుర్తు చేశారు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. తెలంగాణ ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతుందని గుర్తు చేసిన ఈటెల, రాష్ట్రంలో పేద విద్యార్ధుల కోసం 546 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.