భారత్లో కరోనా చికిత్సకు మందు . గ్లెన్మార్క్ ఫార్మా సంస్థ విడుదల
న్యూఢిల్లీ, జూన్ 21:కరోనా రోగుల చికిత్స కోసం మాత్రను ఆవిష్కరించినట్లు భారత ఫార్మా దిగ్గజం, ముంబైకి చెందిన గ్లెన్మార్క్ సంస్థ ప్రకటించింది. యాంటివైరల్ డ్రగ్ ఫవిపిరవిర్ను ఫ్యాబిఫ్లూ పేరుతో శనివారం ఆవిష్కరించింది. ఫ్యాబీఫ్లూ మాత్రల తయారీ, మార్కెటింగ్ కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నుంచి ఇప్పటికే తమకు అనుమతులు లభించినట్లు గ్లెన్మార్క్ వెల్లడించింది. కరోనా చికిత్స కోసం ఉపయోగించే ఓ ఔషధం మన దేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. భారత్లో కొవిడ్ చికిత్సలో మాత్రలకు అనుమతులు పొందిన తొలి సంస్థ గ్లెన్మార్క్ కావడం విశేషం.34 మాత్రలున్న స్ట్రిప్ ధర రూ.3,500. శనివారం ఓ ప్రకటనలో సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొవిడ్-19 స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న రోగులపై ఫ్యాబిఫ్లూ మాత్రలు బాగా పనిచేస్తాయి.