జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు. జ్యోతిరావు పూలే కు నివాళులు అర్పించడానికి ముఖ్యమత్రి కేసీఆర్ కు సమయం లేదా అని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం నాడు ఎల్బీ నగర్ లో జరిగిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో అయన మాట్లాడారు. బీసీ వర్గాల ఓట్ల కోసం మాత్రం కేసీఆర్ జిమ్మికులకు పాల్పడుతారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వీడి బయటకు రావాలని అయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే జ్యోతిరావు పూలే కు నివాళి అర్పించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల ఫీజు రియంబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని అయన డిమాండ్ చేసారు.