YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆరు నెలల ముందే వైయస్సార్ నేతన్న నేస్తం చెల్లింపు అభినందనీయం

ఆరు నెలల ముందే వైయస్సార్ నేతన్న నేస్తం చెల్లింపు అభినందనీయం

ఆరు నెలల ముందే వైయస్సార్ నేతన్న నేస్తం చెల్లింపు అభినందనీయం
 ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చేనేత నాయకులు పాలెపు సుఖ దేవయ్య
నెల్లూరు జూన్ 22 
చేనేత  కుటుంబాల వారికి  రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన  నేతన్న నేస్తం  పథకానికి సంబంధించిన  నగదును  6 నెలల ముందే నగదు చెల్లింపుల కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పట్టు సాలే సంఘం వ్యవస్థాపకులు జిల్లా చేనేత నాయకులు పాలెపు సుఖ దేవయ్య పేర్కొన్నారు . సోమవారం నగరంలోని స్థానిక చేనేత కార్యాలయం నందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేనేత ఆధారిత కుటుంబాల వారికి వైయస్సార్ నేతన్న నేస్తం ఆసరాగా ఏర్పడిందని, ఇటువంటి నూతన పథకానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి చేనేత కుటుంబాలవారు జీవితకాలం రుణపడి ఉంటారని వారందరి తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులకు దీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ప్రత్యేక తరహాలో పరిపాలన సాగిస్తున్న  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సేవలు అభినందనీయమని ఆయన సేవలను కొనియాడారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న ఈ విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు, స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన నేపథ్యంలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు, ఆయన చేసిన చేసిన సేవలకు దీటుగా, ఆయన కుమారుడిగా రాష్ట్ర ప్రజలకు గుర్తుండిపోయే విధంగా ప్రజా సేవ చేస్తున్న జగన్ మరోసారి  రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయం సాధించే దిశగా చేనేత, చేనేత ఆధారిత కుటుంబాలు వారందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని వారి తరఫున భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకనూ వైయస్సార్ నేతన్న నేస్తం దరి చేరని కొద్దిపాటి చేనేత లందరికీ, వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. 

Related Posts