YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మురికివాడల్లో తక్షణమే కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలి

మురికివాడల్లో తక్షణమే కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలి

మురికివాడల్లో తక్షణమే కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలి
హైదరాబాద్ జూన్ 22
సీపీఐ  ఐఎస్ సదన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆర్, శంకర్ నాయక్ హాజరైయారు.  కరోనాకు పూర్తిగా ప్రభుత్వమే వైద్య ఖర్చులను భరించాలని కోరుతూ స్థానిక మండల తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆర్,శంకర్ నాయక్ మాట్లాడుతూ కరోనా వైరస్ ను అరికట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.అన్ని మురికివాడల్లో వైద్య పరీక్షలు తక్షణమే నిర్వహించి, కరోనా భాధితులందరికి గాంధీ లొనే చికిత్స చేయాలని అన్నారు. పేదలకు గాంధీ,ప్రజాప్రతినిధులకేమో కార్పొరేట్ హస్పిటలోనా అని మండిపడ్డారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో భాధితులందరిని అన్ని విధాలా ఆదుకోవాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

Related Posts