YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు హాస్యాస్మదం

వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు హాస్యాస్మదం

వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు హాస్యాస్మదం
విశాఖపట్నం జూన్ 22

వైసీపీ నేతల తీరుపై టిడిపి మాజీ ఎమ్మెల్యే అనిత ఫైర్ అయ్యారు. విశాఖలో ఆమే మీడియాతో మాట్లాడుతూ గతంలో మహిళలపై దాడులు జరిగితే స్పందించని మహిళా కమీషన్ అయ్యన్నపాత్రుడు విషయంలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా విచారణ జరగకుండా ఏవిధంగా నిర్బయ కేసు పెడతారని ప్రశ్నించిన ఆమె,  మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, అయ్యన్న పాత్రుడుపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్మదంగా ఉన్నాయని చెప్పారు. అయితే విచారణ జరుగుతోందని జిల్లా ఎస్పీ చెబుతున్నా, కొంత మంది వైసీపీ పేటిఎం బ్యాచ్ కావాలనే ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు తమ కుటుంబ సభ్యుల ఫోటో విషయంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగి పోలీసు సమక్షంలో ఫోటో తొలగింపుపై అధికారులతో ఆరాదీస్తే,  దీన్ని కొంత మంది వైసీపీ నేతలు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని  అనిత ఆరోపించారు.
 

Related Posts