YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హైకోర్టులో డాక్టర్ అనిత పిటీషన్

హైకోర్టులో డాక్టర్ అనిత పిటీషన్

హైకోర్టులో డాక్టర్ అనిత పిటీషన్
విజయవాడ, జూన్ 22,
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, సీఐడీని ఆదేశించింది.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అనిత రాణి తన పిటిషన్‌లో హాస్పిటల్‌లో అవకతవకలు జరిగాయని.. సీబీఐతో విచారణ చేయించాలని కోరారు.చిత్తూరు ప్రభుత్వ వైద్యశాల సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ అనిత రాణి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, సీఐడీని ఆదేశించింది.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అనిత రాణి తన పిటిషన్‌లో హాస్పిటల్‌లో అవకతవకలు జరిగాయని.. సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. తాను లేవనెత్తిన అంశాలపై సీబీఐతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. సీఐడీ విచారణపై తనకు నమ్మకం లేదన్నారు.చిత్తూరు జిల్ల పెనమూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అనితారాణి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే డాక్టర్ ఆడియో రికార్డును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్వీట్ చేయడం కలకలంరేపింది. విశాఖ డాక్టర్ సుధాకర్‌ను వేదించినట్లే తనను కూడా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన సమస్యల్ని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితతో చెప్పుకున్నారు. తనను వైఎస్సార్‌సీపీ నేతలు బెదిరిస్తున్నారని.. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.ఈ వివాదం రేగగానే అనితారాణి విషయంలో డీహెచ్ఎంవో రమాదేవి నివేదిక ఇచ్చారు. అనితా రాణిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని.. ఆమె విధులకు సరిగా రారని వైద్యం కోసం వచ్చిన పిల్లలను కొడుతున్నారని.. వైద్యం సరిగా చేయరని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ కేసును సీఐడీకి అప్పగించారు. అధికారులు దర్యాప్తు ప్రారంభించగా.. తన ఇంటికి రావొద్దంటూ డాక్టర్ అనిత తాళం వేశారు. తనకు సీఐడీపై నమ్మకం లేదని.. సీబీఐతోనే న్యాయం జరుగుతుంది అన్నారు. తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని.. ఒకవేళ తన ఇంటికి సీఐడీ వస్తే హైకోర్టులో ఫిర్యాదు చేస్తానని అన్నారు.

Related Posts