YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మత్తు మందిచ్చి  దోపిడీ

మత్తు మందిచ్చి  దోపిడీ

మత్తు మందిచ్చి  దోపిడీ
తిరుపతి జూన్23
పట్టపగలే మహిళకు మత్తు మందు ఇచ్చి నగలు,డబ్బు దోచుకెళ్లిపోయాడు ఓ దొంగ. వివరాల్లోకి వెళితే తిరుమల శ్రీవారి పోటులో కాంటాక్ట్ ఉద్యోగి దయాకర్,ఆయన భార్య పద్మ తిరుపతి లోని సత్యనారాయణపురం లో వుంటున్నారు. పద్మ  పిన్ని  ఒక వ్యక్తితో కలసి భక్తి కార్యక్రమాల పేరిట రాహుకేతు పూజలు చేయించే పనిమీద తిరుపతికి వచ్చింది. వచ్చిన వ్యక్తి పద్మతో తనకు శ్రీవారి ప్రసాదాలు కావాల్సినపుడు తెస్తే డబ్బులిస్తానని నమ్మబలికాడు.  ఈ ఉదయం దయాకర్ ఉద్యోగం పని మీద వెళ్లడం గమనించి, ఇంటికి వెళ్లి పద్మను ఆప్యాయంగా పలకరించాడు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు.అనంతరం మత్తులోకి జారుకున్నాక ఒంటిపై ఉన్న బంగారం, బీరువాలోని బంగారం,డబ్బు దోచుకెళ్లాడు. అనంతరం స్పృహ వచ్చిన పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 16.56 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు,70 వేల నగదు దోచుకెళ్లాడని భాదితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Related Posts