YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఉద్యోగులే కాంట్రక్టర్ అవతారాలు

ఉద్యోగులే కాంట్రక్టర్ అవతారాలు

ఉద్యోగులే కాంట్రక్టర్ అవతారాలు
కోదాడ  జూన్ 23
కోదాడ విద్యుత్ ఆఫీసులో ఉద్యోగులే కాంట్రాక్ట్ అవతారం ఎత్తి అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గుర్తిచేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ విద్యుత్ ఆఫీసులో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారని, ఉద్యోగులే కాంట్రాక్ట్ అవతారం ఎత్తి ప్రజలను దోచుకుంటున్నారని బీజేపీ కోదాడ నియోజకవర్గ నాయకులు ఓర్సు వేలంగి రాజు ఆరోపించారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంలో అక్రమాలకు పాలడుతున్నారని సహా చట్టం కింద అడిగిన లెక్కలు చెప్పడం లేదని అన్నారు. నూతన కనెక్షన్, విద్యుత్ స్తంభాల కోసం రైతులు వస్తే వాటాల ప్రకారం అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ శాఖలోని ఆయా పనులకు ఉద్యోగులే కాంట్రాక్ట్ లను తీసుకొని నాసిరకం పనులు చేస్తు ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు ఉన్నత అధికారులు వెంటనే స్పందించి సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, అవినీతి ఉద్యోగుల దోపిడీ నుండి ప్రజలను కాపాడాలి అని డిమాండ్ చేశారు.

Related Posts