YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఏసీబీ వలలో వీఆర్వో

ఏసీబీ వలలో వీఆర్వో

ఏసీబీ వలలో వీఆర్వో
పాల్వంచ జూన్ 23
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. కళ్యాణాలక్ష్మి పథకం మంజూరు చేయడం కొరకు 10వేల రూపాయలను యానంబైల్ వీఆర్వో గుగులోత్ పద్మ డిమాండ్  చేసిందని ఆరోపణ. కిన్నెరసాని గ్రామానికి చెందిన గుమ్మడి నాగమణి తన మేనకోడలు వివాహం కోసం  కళ్యాణాలక్ష్మి పథకం కొరకు  వీఆర్వో పద్మ కు దరఖాస్తు చేసుకున్నారు.  కళ్యాణలక్ష్మి పథకం మంజూరు చేయాలంటే తనకు   పది వేలు లంచం ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేయడం తో దిక్కుతోచని ఆ పేద కుటుంబం ఏసీబీ ని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఫిర్యాదు దారు నాగమణి ద్వారా వీఆర్వో 7వేల రూపాయలను లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.

Related Posts