డీజీపీ హాజరు కావాలి
- ఏపీ హైకోర్టు
అమరావతి జూన్ 23
అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణ చేపట్టింది. వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలను పాటించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాహనాల విడుదలపై ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణతో హైకోర్టు సంతృప్తి చెందలేదు. దీంతో రాష్ట్ర డీజీపీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది