YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

 నయీం కేసులో కొత్త కీలక పరిణామం

 నయీం కేసులో కొత్త కీలక పరిణామం

 నయీం కేసులో కొత్త కీలక పరిణామం
హైద్రాబాద్, జూన్ 24
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ఇప్పటికే 25 మంది అధికారులపై పోలీస్‌శాఖ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. నయీంతో కలిసి పోలీసులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో కొత్త కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసు వ్యవహారంలో నయీంతోపాటు పోలీసు, రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించారన్న ఆరోపణల నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సేకరించింది. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఈ ఆధారాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతోంది. నయీం కేసులో పోలీసు, రెవెన్యూ అధికారుల పాత్రలపై పూర్తి ఆధారాలు సేకరించింది.గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ఇప్పటికే 25 మంది అధికారులపై పోలీస్‌శాఖ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. నయీంతో కలిసి పోలీసులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. నయీంతో దిగిన ఫోటోలతో సహా వీడియో సాక్ష్యాలను లోక్‌పాల్ ముందు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రవేశపెట్టబోతోంది. నయీంతో కలిసి రూ.కోట్లు అధికారులు సంపాదించారని ఆరోపణలు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై లోక్‌పాల్ ద్వారా విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తోంది.

Related Posts