YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

భార్యను చంపి..అత్తను హత్య చేసి..సూసైడ్

భార్యను చంపి..అత్తను హత్య చేసి..సూసైడ్

భార్యను చంపి..అత్తను హత్య చేసి..సూసైడ్
కోల్ కత్తా, జూన్ 24
భార్యతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు అమిత్. అయితే అదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో దారుణంగా చంపేశాడు. బెంగళూరు నుంచి కోల్‌కతాలో ఉంటున్న అత్త దగ్గరికి వెళ్లాడు.కట్టుకున్న భార్యని అమానుషంగా అంతమొందించాడు. సైలెంట్‌గా ఫ్లైటెక్కేసి కోల్‌కతాలో వాలిపోయాడు. నేరుగా అత్తింటికి వెళ్లి ఆమెని తుపాకీతో కాల్చేశాడు. భయపడిపోయిన మామ బయటికి పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్నాడు. తీరా పోలీసులు ఇంటికొచ్చి చూసేసరికి రెండు మృతదేహాలు పడి ఉండడం చూసి షాక్‌కి గురయ్యారు. కోల్‌కతా పోలీసులు ఫోన్ చేయడంతో బెంగళూరులో జరిగిన కూతురి మర్డర్ బయటికొచ్చింది. విడాకుల కోసం విసిగిపోయిన అల్లుడు కూతురిని, అత్తని చంపేసిన అమానుష ఘటన వెలుగుచూసిందిబెంగళూరులో నివాసముంటున్న అమిత్ అగర్వాల్(42), శిల్పి అగర్వాల్ భార్యాభర్తలు. కొద్దికాలం నుంచి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతుండడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఆ విషయమై మరోమారు ఇద్దరి మధ్యా తీవ్రఘర్షణ చోటుచేసుకోవడంతో భార్యని దారుణంగా హత్య చేశాడు. తన ఫ్లాట్‌లోనే భార్య శవాన్ని ఉంచి నేరుగా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాడు.అత్త కారణంగానే ఇంట్లో గొడవలు పెరిగిపోయాయన్న కోపంతో కోల్‌కతా చేరుకున్నాడు. అత్తింటికి వెళ్లి భార్య తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. వారిని తీవ్రంగా దూషిస్తూ ఒక్కసారిగా తుపాకీ తీసి అత్త లలిత దండానియా(60)పై కాల్పులు జరిపాడు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న మామ సుభాష్ దండానియా ఇంటి నుంచి బయటికి పరుగెత్తి ప్రాణాలు నిలుపుకున్నాడు.స్థానికులు, బంధువుల సాయంతో పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. అయితే ఇంట్లో రెండు మృతదేహాలను చూసి షాకయ్యారు. అత్తని చంపిన అల్లుడు కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అమిత్, అత్త లలిత మృతదేహాలను పరిశీలించారు. ఆధారాలు సేకరించారు. అమిత్ వద్ద లభ్యమైన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.అందులో తన భార్యని హత్య చేసినట్లు ఉండడంతో కోల్‌కతా పోలీసులు వెంటనే బెంగళూరు పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన బెంగళూరు పోలీసులు శిల్పి అగర్వాల్ ఇంటి తలుపుతట్టారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో బలవంతంగా లోపలికి ప్రవేశించి చూసేసరికి కిచెన్ పక్కనే ఉన్న వాడ్‌రోబ్ వద్ద శిల్పి మృతదేహాన్ని గుర్తించారు. అమిత్ భార్యని చంపి.. అత్తని చంపేందుకు కోల్‌కతా వెళ్లి ఉంటాడని.. అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts