పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల లో అవకతవకలు
విశాఖపట్నం జూన్ 24
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్న పథకాలు లో ఒకటైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని అనకాపల్లి మాజీ మార్కెటింగ్ వైస్ చైర్మన్ కన్నురు వెంకటరమణ ఆరోపించారు. బుధవారం తాణం గ్రామంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుపేదలకు ఇల్లు లేకుండా ఉండకూడదని అనేఉద్దేశంతో ప్రేవేశపెట్టిన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే పథకంలో అన్నీ అవకతవకలే జరిగాయని అన్నారు. అలాగే స్థానిక వాలంటీర్లు, అధికార పార్టీకి చెందిన నాయకులు కలిసి అర్హులైన నిరుపేదల నీ అనర్హులుగా గుర్తించారని అన్నారు. తమ సొంత పార్టీకి చెందిన వ్యక్తులకే ఇళ్ల పట్టాల కు అర్హులుగా చేర్చడం ఎంత వరకు సమంజసమని అన్నారు. అంతే కాకుండా అధికార పార్టీకి చెందిన నాయకుల సొంత కుటుంబ సభ్యులను పరుగులుగా చేర్చడం తో అధికార పార్టీని, నాయకులను ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిజమైన నిరుపేదలను గుర్తించివాళ్లకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు డీఎం ఎల్ నాయుడు, కుంద్రపు శ్రీరామమూర్తి,గోపాల కృష్ణ, వసంత్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.