YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సామాజిక అభివృద్ధికి కృషి చేయాలి.. మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం

సామాజిక అభివృద్ధికి కృషి చేయాలి.. మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం

సామాజిక అభివృద్ధికి కృషి చేయాలి..
       మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం
మండపేట జూన్ 24
కాపునాడు..కాపు ప్రజల సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ సిద్ధాంతకర్త ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. బుధవారం కిర్లంపూడి లోని తన నివాసంలో కలిసిన ఆంధ్రప్రదేశ్ కాపునాడు అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం, యువ కాపునాడు అధ్యక్షులు అంబటి సురేష్, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు జిన్నూరి సత్య సాయి బాబా, కాపునాడు లీగల్ అడ్వైజర్ టీవీ గోవిందరావులు.  ఈ సందర్భంగా పద్మనాభం వారితో ముచ్చటించారు.  సామాజిక సేవా సంస్థగా కాపునాడు ను తీర్చిదిద్దాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న రెండు మూడు  కాపునాడు లను కూడా సమావేశపరిచి వారందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. వివిధ జిల్లాల్లో కాపు నేస్తం, కాపు రుణాలు, కాపు మహిళా రుణాలు వంటి పంపిణీ కార్యక్రమాలు కాపు కార్పొరేషన్ ద్వారా అందరి లబ్ది దారులకు అందుతున్నాయో లేదో సమీక్షించుకోవాలి అన్నారు. అనంతరం త్వరలో వివిధ జిల్లాల్లో పర్యటించి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటానని పద్మనాభం స్పష్టం చేశారు.

Related Posts