YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

30 వేలు తగ్గించిన సాంసగ్

30 వేలు తగ్గించిన సాంసగ్

30 వేలు తగ్గించిన సాంసగ్
ముంబై, జూన్ 24, 
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ కు చెందిన ఏ80 స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.30 వేల తగ్గింపు లభించింది. దానికి సంబంధించిన వివరాలు ఇవే.శాంసంగ్ తన గెలాక్సీ ఏ80 స్మార్ట్ ఫోన్ పై భారీ ధర తగ్గింపును అందించింది. ఫ్లిప్ కార్ట్ లో ఉన్న లిస్టింగ్ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.52,000 కాగా ఇప్పుడు దానిపై రూ.30,001 తగ్గించారు. దీంతో ఈ ఫోన్ ఇప్పుడు రూ.21,999కే అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం బిగ్ సేవింగ్స్ డే జరుగుతోంది. ఈ ధర తగ్గింపు అందులో భాగమా? లేక ఇకపై ఇదే ధర అందుబాటులో ఉండనుందా? అనే విషయం ఇంకా తెలియలేదు ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 3700 ఎంఏహెచ్ గా ఉంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ ను కూడా సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, మరో 8 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. వెనకవైపు కెమెరాలో ఆటోఫోకస్ ఫీచర్ ను కూడా అందించారు. ఇందులో 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ను అందించారు. రెండు నానోసిమ్ లను ఇందులో అమర్చే విధంగా సిమ్ ట్రేను అందించారు. ఏంజెల్ గోల్డ్, ఘోస్ట్ వైట్, ఫాంటం బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. వైఫై, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ, 3జీ, 4జీలను ఇది సపోర్ట్ చేస్తుంది. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను ఇందులో అందించారు. అలాగే ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

Related Posts