దేశంలో 15,968 పాజిటివ్ కేసులు నమోదు 465 మంది మరణం
న్యూఢిల్లీ జూన్ 25
: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజు 15 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,968 పాజిటివ్ కేసులు నమోదవగా, 465 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,56,183కు చేరగా, మరణాలు 14,476కి పెరిగాయి. ఇప్పటివరకు కరోనా బారినపడిన వారిలో 2,58,685 మంది కోలుకోగా, మరో 1,83,022 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసుల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,39,010 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 3214 కేసులు నమోదవగా, 248 మంది మరణించారు. రెండో స్థానంలో ఉన్న ఢిల్లీలో కొత్తగా 3,947 పాజిటివ్ కేసులు నమోదవగా, 68 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,602కు చేరగా, మృతులు 2,301కి పెరిగారు. రాష్ట్రంలో 24,988 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కేసులు నమోదవగా, 465 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,56,183కు చేరగా, మరణాలు 14,476కి పెరిగాయి. ఇప్పటివరకు కరోనా బారినపడిన వారిలో 2,58,685 మంది కోలుకోగా, మరో 1,83,022 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసుల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,39,010 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 3214 కేసులు నమోదవగా, 248 మంది మరణించారు. రెండో స్థానంలో ఉన్న ఢిల్లీలో కొత్తగా 3,947 పాజిటివ్ కేసులు నమోదవగా, 68 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,602కు చేరగా, మృతులు 2,301కి పెరిగారు. రాష్ట్రంలో 24,988 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.