YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీతో పొత్తు వల్లే బీజేపీకి ఆ నాలుగు సీట్లు: చంద్రబాబు

టీడీపీతో పొత్తు వల్లే బీజేపీకి ఆ నాలుగు సీట్లు: చంద్రబాబు

టీడీపీతో పొత్తు వల్లే బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయని,బీజేపీతో పొత్తు లేకుంటే టీడీపీకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు:కేంద్రప్రభుత్వం నాలుగో బడ్జెట్‌లో కూడా ఏపీకి అన్యాయం చేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని అభివృద్ధి  చేస్తామంటేనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామన్నారు. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నామని,అది కూడా సరిగా అమలు చేయలేదని సీఎం అన్నారు. కేంద్రం మోసం చేసిందని తెలిసే తిరుగుబాటు చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు..పార్లమెంటు సరిగా జరగలేదని ప్రధాని మోదీ నిరాహార దీక్ష చేస్తామని అంటున్నారని, ప్రజల మనోభావాలతో మోదీ ఆడుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 30న తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా...గతంలో మోదీ చెప్పిన మాటలను గుర్తు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్రంపై ఎలాంటి పోరాటాలకైన సిద్దమన్నారు. అమరావతికి అన్ని ఇస్తామని తిరుపతిలో చెప్పిన మోదీ... ఇప్పుడు మాట తప్పారని, టీడీపీపై బురద జల్లుతున్నారని చంద్రబాబు విమర్శించారు.రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు టీడీపీయే గెలవాలని, అప్పుడే కేంద్రంలో మనమనుకున్న ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీతో రాజీ పడే వైసీపీ ఎంపీలు రాజీనామాల డ్రామా ఆడారని, ఏపీ ప్రజలకు వైసీపీ ఎంపీలు నామాలు పెట్టారని చంద్రబాబు విమర్శించారు.

Related Posts