వామపక్షాల ఆందోళన
ఆదిలాబాద్ జూన్ 25
గత కొన్ని రోజులుగా ప్రతినిత్యం పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామ పక్షాలు ఆందోళనకు దిగాయి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల నేతలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి దత్తాత్రి లంక రాములు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గత వారం రోజులుగా ప్రతి నిత్యం పెట్రోల్ డీజిల్ ఛార్జీలను పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతున్నారని నేతలు ఆరోపించారు.