YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అచ్చెన్నాయుడు ను అరెస్టు చేయడం  వైకాపా కుట్ర

అచ్చెన్నాయుడు ను అరెస్టు చేయడం  వైకాపా కుట్ర

అచ్చెన్నాయుడు ను అరెస్టు చేయడం  వైకాపా కుట్ర
నెల్లూరు జూన్ 25
బీసీ నాయకులు అచ్చెన్నాయుడు అరెస్ట్ వెనుక వైకాపా కుట్ర దాగి ఉందని నెల్లూరు జిల్లా టిడిపి అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర పేర్కొన్నారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ నాయకుడు అచ్చెన్నాయుడుపై ప్రభుత్వానికి ఇంకా కక్ష తీర లేదు అన్నారు .ఆయనను ఇబ్బంది పెట్టాలని చూడటం అత్యంత దారుణమన్నారు.అచ్చెన్నాయుడు ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. బీసీ నేతల పట్ల కక్షసాధింపు విధానాలకు ఇది పరాకాష్టగా నిలుస్తుందని తమ ఆవేదన వ్యక్తపరిచారు.కోర్టు తీర్పును ఉల్లఘించి మరీ అరెస్ట్ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ప్రభుత్వానికి చట్టాలు, న్యాయస్థానం ఆదేశాలు పట్టడం లేదని విమర్శించారు. జగన్ అవినీతిని వెలికితీసినందునే ఎర్రన్నాయుడు కుటుంబంపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అధికారం శాశ్వతం కాదని గ్రహించాల్సి ఉంటుందని వైకాపా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జగన్ విధానాలను ప్రజలు, బీసీ నాయకులు, ప్రతిపక్షాలు, మేధావులు ప్రతిఒక్కరు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కోర్టు ఆదేశాల ప్రకారం జీజీహెచ్ లో అచ్చెనాయుడు ఉన్న ప్రాంతంలో రెస్టింగ్ పొజిషన్ లోనే విచారణ చేపట్టాలి,అయినప్పటికీ పెడచెవిన పెడుతున్నారని ఆవేదనకు గురయ్యారు. వైద్యులు, పోలీసులు, ఏసీబీ అధికారులు జగన్ చెప్పినట్లే చేస్తున్నారని, ఇది సమంజసం కాదన్నారు. ఎవరిపై కక్ష తీర్చుకునేందుకు ఇదంతా చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ఏ ప్రభుత్వమైనా న్యాయ వ్యవస్థకు, చట్టాలకు కట్టుబడి ఉండాలని, వైకాపా ప్రభుత్వం మాత్రమే తనకు నచ్చిన రీతిలో పరిపాలన సాగిస్తుందని వైకాపా ప్రభుత్వ పాలన పై ధ్వజమెత్తారు.

Related Posts