టీడీపీ నేతల ఆరెస్టు
విజయవాడ జూన్ 25
గత టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ ప్రాంతానికి టీడీపీ నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో కరకట్ట వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజా వేదికకు వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఇక్కడ ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఆదేశాలను ధిక్కరిస్తే అరెస్టు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, దేవినేని ఉమా, వర్ల రామయ్య, ఆలపాటి రాజా, కొల్లు రవీంద్ర తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.