YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 ఆగస్టు 12 వరకు రైళ్లు రద్దు

 ఆగస్టు 12 వరకు రైళ్లు రద్దు

 ఆగస్టు 12 వరకు రైళ్లు రద్దు
న్యూఢిల్లీ, జూన్ 26
 కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 12 వరకు అన్ని రెగ్యులర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు  నోటిఫికేషన్ జారీ చేసింది. మెయిల్ అండ్ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ సర్వీసులతో పాటు రెగ్యులర్ టైమ్ టేబుల్ ప్యాసింజర్ సర్వీసులు అన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయించినట్లు రైల్వే బోర్డు పేర్కొంది. జులై 1 నుంచి ఆగస్టు 12 వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. టికెట్ డబ్బులను వాపస్ చెల్లించనున్నట్లు తెలిపింది.అయితే.. మే 12, జూన్ 1 నుంచి ప్రారంభించిన అన్ని ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. వీటిలో రాజధాని, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు అన్నీ కలిపి 230 రైళ్లు ఉన్నాయి. దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఏప్రిల్‌ 14, ఆ తర్వాత టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఆ సొమ్ము మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇవ్వనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా భారతీయ రైల్వే ఏప్రిల్‌ 15 నుంచి అన్ని సాధారణ రైళ్లలో బుకింగ్‌లను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రారంభమవడంతో అన్ని రైలు సర్వీసులను నిలిపివేసింది. జూన్ 30 వరకు ఆయా రైళ్లకు చెందిన రిజర్వేషన్లను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 నుంచి 4 నెలలకు గాను ప్రయాణికులు చేసుకున్న బుకింగ్‌లను రద్దు చేసి, ఆ టికెట్లకుగాను పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని రైల్వే శాఖ తెలిపింది.ఇంతకుముందు జూన్ 30 వరకు ప్రయాణానికి షెడ్యూల్ చేసిన అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే శాఖ టికెట్లను రీఫండ్ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ మేరకు మే 15న నోటిఫికేషన్‌లో జారీ చేసింది. ప్రస్తుతం అత్యవసర ప్రయాణాల నిమిత్తం ఇండియన్ రైల్వే వివిధ మార్గాల్లో 230 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

Related Posts