YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

దంపతులపై దాడి…భర్త మృతి..భార్యకు తీవ్రగాయాలు

దంపతులపై దాడి…భర్త మృతి..భార్యకు తీవ్రగాయాలు

దంపతులపై దాడి…భర్త మృతి..భార్యకు తీవ్రగాయాలు
మంచిర్యాల జూన్ 26, 
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. దంపతులపై హత్యాయత్నం కలకలం రేపుతోంది.మృతిని ఇంట్లోకి వెళ్లే కరెంట్ సరఫరాను నిలిపివేసి,కారంచల్లి కత్తులతో అతి దారుణంగా దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఈ దాడిలో పొశం అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతిని భార్య శంకరమ్మ తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన శుక్రవారం  తెల్లవారుజామున జరిగినట్టు తెలుస్తుంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలంలో డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో పోలిసులు నిమగ్నమయ్యారు. హత్యకు అన్నదమ్ముల మధ్య భూతగాదాలే కారణంగా తెలుస్తుంది.మృతుడు పొశం మండలంలోని గంపలపల్లిలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నడు.
 

Related Posts