స్పీకర్ సాక్షిగా బాహాబాహీ
శ్రీకాకుళం జూన్ 26
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం అధికారపార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. శుక్రవారం ఏపీ స్పీకర్ తమ్మినేని పొందూరు మార్కెట్ యార్డులోని ప్రమాణస్వీకారకార్యక్రమంలో పాల్గొన్నారు . పొందూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన సునీల్ కుమార్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. అయితే మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో బాహాబాహీకి దిగారు. వైసీపీలోని రెండు వర్గాల కార్యకర్తలు. తమ్మినేని సీతారాం సమక్షంలోనే ఘర్షణకు దిగిన వైసీపీ శ్రేణులు ఆయనకే చికాకు తెప్పించారు. మార్కెట్ కమిటీలో ఒకవర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని మరో వర్గం అసహనం వ్యక్తం చేసింది. ఇరువర్గాలకు తమ్మినేని సర్ధిచెప్పినా వారు వినలేదు. ఆఖరికి పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది.