బీహార్ లోని చంపారన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి చేతుల మీదుగా స్వచ్ఛగ్రాహీ అవార్డు పొందిన, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జూపల్లి నీరజ ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ బుధవారం హైదరాబాద్ లో సత్కరించారు.
ప్రధాన మంత్రి చేత గుర్తింపు పొందడం తెలంగాణ రాష్ట్రానికే ఒక గౌరవంగా కమిషనర్ పేర్కొన్నారు. జూపల్లి నీరజ లాగా మరింతమంది స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో ప్రజల కు అవగాహన కల్పించి రాష్ట్రానికి మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా, గ్రామాల్లో పారిశుద్ధ్యం పట్ల, ఆరోగ్యం పట్ల మరింత అవగాహన పెంచేందుకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛగ్రాహీలను గ్రామాలలో నియమింపచేశారు. వీరు ఇంటింటికీ తిరిగి, ప్రజలలో అవగాహన కలిగించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల పైచిలుకు స్వచ్ఛగ్రాహీలు సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ దిలిప్ కుమార్ కన్సల్టెంట్లు మునీందర్, గోవర్ధన్, స్ఫూర్తి సతీష్, ప్రేరక్ శరత్ పాల్గొన్నారు.