రెడ్డి కార్పోరేషన్" ఏర్పాటు చేయాలి
సిఎం ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలి రెడ్డి ఐకాస జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి
జగిత్యాల జూన్ 26
ముఖ్యమంత్రి కేసీఆర్ గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని జగిత్యాల జిల్లా రెడ్డి ఐకాస అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారుశుక్రవారం జగిత్యాలలో సిద్దిపేట జిల్లా రెడ్డి ఐకాస మహిళా అధ్యక్షురాలు గాడిపెల్లి అరుణా రెడ్డి తో కలిసి కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో రెడ్డి, వైశ్య వర్గాలకోసం రెండు వేర్వేరు కార్పోరెషన్లు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పడంతో ఎన్నికల్లో మద్దతు తెలిపారని తీరా అధికారంలోకి రాగానే దీని ఊసెత్తకపోవడం శోచనీయమన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఓసిల్లోని పేదలను ఆదుకోవాలని , ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని , ఓసిల్లోని పేదకుటుంబాల పిల్లల చదువులకోసం ఓసి హాస్టళ్లు ఏర్పాటు తో పాటు వివిధ రకాల డిమాండ్లతో శాంతియుతంగా ఉద్యమాలు చేస్తువస్తున్నామని వారు తెలిపారు. ఓసి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తే ఈ వర్గాల్లోని పేదలకు న్యాయం జరుగుతుందని పదేపదే ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోక ఎన్నికల సమయంలో ఓసి కార్పోరేషన్ కాకుండా ఈవర్గాలను విడదీసే ఆలోచనలతో రెడ్డి, వైశ్య కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం మాఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నించి ఎన్నికల్లో లబ్ది పొందినా మీ హామీని నిలబెట్టుకోకపోవడం బాధాకరమన్నారు. ఏడాదిన్నర గడిచిన దీనిపై మాట మాట్లాడక పోవడం ఈ వర్గాల పట్ల మీకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు.