YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 శ్రీమఠం ఉద్యోగులను తొలగిస్తే పది రూపాలలో నిరసన 

 శ్రీమఠం ఉద్యోగులను తొలగిస్తే పది రూపాలలో నిరసన 

 శ్రీమఠం ఉద్యోగులను తొలగిస్తే పది రూపాలలో నిరసన 
మంత్రాలయం జూన్ 27
 ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో తక్కువ జీతంతో పని చేస్తున్న కార్మికులను బదిలీల పేరుతో విధుల నుంచి తొలగించాలని పీఠాధిపతులు ఆలోచిస్తున్నారని ఈ విధానం మంచిది కాదని కార్మికులను నిధుల నుండి తొలగించాలని ఆలోచన వెంటనే విరమించుకోవాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ శ్రీ మఠంలో చాలీచాలని జీతాలతో కార్మికులు పని చేస్తున్నారని పీఠాధిపతులు కొత్త కొత్త జీవోలు తెస్తూ కార్మికులను విధుల నుండి తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. పది మందిని కార్మికులను చాలా నెలల నుండి ఎటువంటి నోటీసు జారీ చేయకుండా జీతాలు ఇవ్వకుండా  ఇబ్బందులు పెడుతున్నారని ,వారిని వెంటనే విదుల్లోకో తీసుకుని జీతాలు  విడుదల చేయాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎం యల్లప్ప, మహేంద్ర, సంజీవ నరసింహులు, హానీఫ్ ,నరసన్న ,గంగానాయక్ తదితరులు పాల్గొన్నారు

Related Posts