YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 తెరపైకి అన్నవైసీపీ 

 తెరపైకి అన్నవైసీపీ 

 తెరపైకి అన్నవైసీపీ 
న్యూఢిల్లీ, జూన్ 27
అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ.. ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇదో పార్టీ ఉందని అనూహ్యంగా తెరపైకి తెచ్చారు. షోకాజ్ నోటీసుకు సమాధానంగా లేఖ రాసిన ఆయన.. ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇంతకీ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరిది.. ఎప్పుడు స్థాపించారు.. అధ్యక్షుడు ఎవరు వంటి ప్రశ్నలు వినిపించాయి. అందరూ వివరాల కోసం ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఈ పార్టీ వ్యవస్థాపకుడు కూడా కడప జిల్లాకు చెందిన వ్యక్తి కావడం విశేషం.. అంతేకాదు ఆయన కీలక అంశాలను చెప్పుకొచ్చారు.అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP)రిజిస్టర్ కావడానికి మూడు నెలల ముందే గుర్తింపు పొందిందట. కడపకు చెందిన మహబూబ్ బాషా పార్టీని పెట్టారు. తనకు మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పిలవడానికి అనుమతి ఉందంటున్నారు. అసలైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తనదే అని చెబుతున్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తేడా ఉందని చెప్పుకొస్తున్నారు. వైఎస్సార్‌ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన పార్టీ అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మాత్రమేనని అంటున్నారు.మొన్నటి వరకు తెలియని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రఘురామకృష్ణంరాజు తెరపైకి తేవడం ఆసక్తికరంగా మారింది. దీని వెనుక రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా అనే చర్చ జరుగుతోంది. అంతేకాదు ఆ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా మీడియా ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. గతంలో వైఎస్సార్‌సీపీ విషయంలో వివాదం రేగగా.. ఆ తర్వాత మళ్లీ సద్దుమణిగింది. మరి ఈ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related Posts