YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఈశాన్య రాష్ట్రాల బంద్...

ఈశాన్య రాష్ట్రాల బంద్...

ఈశాన్య రాష్ట్రాల బంద్...
గౌహాతి, జూన్ 26,
రోనా కేసులు పెరుగుతున్న వేళ అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న కమ్రూప్ జిల్లాలో మరోసారి లాక్‌డౌన్ విధించింది. 14 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేయనున్నారు.కరోనా కేసులు పెరుగుతున్న వేళ అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కమ్రూప్ జిల్లాలో జూన్ 28 అర్ధరాత్రి నుంచి 14 రోజుల పాటు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాలకు గేట్ వే అయిన గౌహతి ఈ జిల్లాలోనే ఉంది. 12 గంటల కర్ఫ్యూ విధించనున్నట్లు అసోం ఆరోగ్య మంత్రి హిమాంత బిశ్వ శర్మ తెలిపారు. రాత్రి 7 గంటల నుంచి ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పారు. 14 రోజుల లాక్‌డౌన్‌లో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.గౌహతిలో ఇప్పటివరకు 762 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 677 కేసుల్లో బాధితులకు ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదు. ఈ కేసులన్నీ జూన్ 15 తర్వాతే నమోదవడం గమనార్హం. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో అసోంలో కేసుల సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. జూన్ 15 తర్వాత వైరస్ వ్యాప్తి అనూహ్యంగా పెరిగింది.లాక్‌డౌన్ ఆంక్షలు సడలించి వలస కార్మికులు, విద్యార్థులు, ఇతరులకు స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చిన తర్వాత గౌహతిలో వైరస్ వ్యాప్తి పెరిగింది. బయట నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వైరస్ సోకిందని మంత్రి హిమాంత బిశ్వ శర్మ తెలిపారు.అసోంలో గురువారం 276 కేసులు నమోదు కాగా.. వీటిలో 133 కేసులు గౌహతిలోనే ఉన్నాయి. ‘ఇక వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించాం. 14 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేస్తాం. వారం తర్వాత సమావేశం నిర్వహించి పరిస్థితి సమీక్షిస్తాం’ అని హిమాంత బిశ్వ శర్మ పేర్కొన్నారు.అసోంలోని ఇతర పట్టణాలు, మున్సిపల్ ప్రాంతాల్లోనూ వారాంతాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Related Posts