YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

డ్రగ్స్ కు దూరంగా ఉండండి : చిరు సలహా

డ్రగ్స్ కు దూరంగా ఉండండి : చిరు సలహా

డ్రగ్స్ కు దూరంగా ఉండండి : చిరు సలహా
విజయవాడ, జూన్ 27
పంచవ్యాప్తంగా యువత డ్రగ్స్‌కు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును సర్వ నాశనం చేసుకుంటున్నారని, యువత మత్తు పదార్థాలకు బానిసవ్వడం మనసును కలిచివేస్తోందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, చెస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్, పలువురు సీనియర్ ఐపీఎస్‌ అధికారులు, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్‌ అవగాహన కార్యక్రమాల బ్రోచెర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెబినార్‌ ద్వారా మాట్లాడుతూ.. ‘యాంటీ డ్రగ్‌ ప్రచారం చేయటానికి పూనుకున్న పోలీసు వారిని.. డీజీపీ సవాంగ్‌, ఇతర అధికారులు, వెబినార్‌ సమావేశంలో పాల్గొన్న వారందరిని స్వాగతిస్తున్నా. ఎన్నో జన్మల పుణ్య ఫలం మనిషి జన్మ. అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవడం అవసరమా? క్షణికానందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం.మన మీద ఆధారపడ్డ కుటుంబాల్ని వీధిన పడేయటం సమంజసమా. దురలవాట్లకు బానిసైన మిమ్మల్ని చూసి కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి వాళ్ల వైపు నుంచి ఆలోచించండి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే ఆనందపడతారా? బాధ్యతగా వ్యవహరిస్తే మీ జీవితం నందనవనం అవుతుంది’అని చిరంజీవి పేర్కొన్నారు. డ్రగ్స్‌ను విడనాడాలని యువతకు పిలుపునిచ్చారు.

Related Posts