YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

తలక్రిందులవుతున్న మోడీ, అమిత్ షా అంచనాలు

 తలక్రిందులవుతున్న మోడీ, అమిత్ షా అంచనాలు

మోడీ- షా  రంగంలోకి దిగారంటే.. ప్రత్యర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే. ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ విజ‌యం ఖాయం.. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను మ‌ట్టిక‌రిపిస్తూ ముందుకు దూసుకెళ్లడంలో ఆ ద్వయానికి సాటిలేదు… ఇప్పుడీ ద్వయం ప్రాభ‌వం కోల్పోతోందా..? ఈ ఘ‌నతంతా గ‌తంగా మిగిలిపోతుందా..? న‌లువైపులా చుట్టుముడుతున్న అనేక స‌వాళ్లను ఎదుర్కోలేక త‌డ‌బ‌డుతోందా..? అంటే ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో మెజారిటీ రాకున్నా త‌మ వ్యూహంతో ప్రత్యర్థుల అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ అధికారం చేజిక్కించుకున్న మోడీ-షా ద్వయం ఇటీవ‌ల మాత్రం క‌నీస ప్రభావం చూప‌లేక త‌డ‌బడుతోందని అనేకంటే చ‌డీచ‌ప్పుడు లేకుండా ఉండిపోతోంద‌ని అన‌డమే క‌రెక్ట్‌. ప్రతి రాష్ట్రంలోనూ ఇష్టారాజ్యంగా బీజేపీ ఆధిపత్య రాజకీయాలకు పాల్పడుతున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కేరళలోని కొట్టాయంలో ఒక ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఈ పని చేసింది అధికార సీపీఎం కార్యకర్తలన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై వెంటనే ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కు ఫోన్ చేసి మరి హోంమంత్రి రాజ్ నాథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో గోరక్షకుల పేరిట ‘బీఫ్' తింటున్నారన్న పేరుతో దాడుల్లో మరణాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. బీహార్‌లో మహా కూటమికి ఇలా బీటలు ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత బీజేపీ.. కీలక రాష్ట్రమైన బీహార్ పై కేంద్రీకరించింది. 1998 నుంచి 2013 వరకు ఎన్డీయేతోనే ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్.. ప్రధాని పదవికి మోదీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన బీజేపీపై కోపంతో బయటకు వచ్చారు. 2014లో బీహార్ రాష్ట్రంలో సీట్లన్నీ బీజేపీ గెలుచుకున్నది. దీంతో పాత శత్రువు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో జత కట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది. మూడు పార్టీలు మహా కూటమిగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాయి. సీఎంగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. కానీ తాజాగా మారిన పరిణామాల్లో గతం అంతా తవ్వి తలకెత్తారు. 2006లో రైల్వేశాఖ మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పనిచేసినప్పుడు ఐఆర్సీటీసీకి అనుబంధంగా ఉన్న హొటళ్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారన్న కేసు బయటకు లాగారు.రాజ‌స్థాన్, ఉత్త‌ర‌ప్రదేశ్‌ త‌దిత‌ర రాష్ట్రాల్లో జ‌రిగిన లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలించి. ఉత్తర‌ప్రదేశ్‌లో ఏకంగా రెండు స్థానాల్లో బీజేపీ ఘోర ఓట‌మిని చ‌విచూసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప‌లుమార్లు ప్రాతినిథ్యం వ‌హించిన‌ గోర‌ఖ్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఆ పార్టీ అభ్యర్థి ఓట‌మిపాల‌య్యారు. సీఎం ఆదిత్యనాథ్‌తో పాటు డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్రసాద్ మౌర్య రాజీనామా చేసిన ఫుల్ఫూర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు.ఉత్తర‌ప్రదేశ్‌లో ఎస్‌పీ, బీఎస్‌పీలు క‌లిసి న‌డిచి బీజేపీని దెబ్బకొట్టాయి. ఉత్తర‌ప్రదేశ్‌లో తిరుగులేద‌ని చెప్పుకుంటున్న దశ‌లో ఉపఎన్నిక‌లు ఊహించ‌ని షాక్ ఇచ్చాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఈ రెండు పార్టీల‌తో పాటు కాంగ్రెస్ కూడా జ‌త క‌లిస్తే యూపీలో బీజేపీ ప‌ని ఖేల్ ఖ‌తం. ఇది బీజేపీని తెగ టెన్షన్ పెడుతోంది. ఇదే స‌మ‌యంలో ద‌ళితుల స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డంలో యోగి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నార‌ని, ద‌ళితుల‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌నీ సొంత పార్టీకి చెందిన న‌లుగురు ద‌ళిత ఎంపీలు బ‌హిరంగంగానే విమ‌ర్శలు గుప్పించారు. ఇద్దరు పార్టీ అధిష్టానానికి లేఖ‌లు కూడా రాశారు. ఇక్కడ విష‌యమేమంటే రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై మోడీ, షాలు సీఎం యోగిపై ఆగ్రహం వ్యక్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఈ ప‌రిణామాలన్నీ కూడా మోడీ-షా ద్వయం ప్రాభ‌వాన్ని కోల్పోయేలా చేస్తున్నాయ‌నీ ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. తాజాగా మోడీ ముఖ్యమంత్రి యోగిని ఢిల్లీకి పిలిచి మ‌రీ ఫుల్ క్లాస్ పీకారు. అక్కడ ప‌రిస్థితిని చక్కదిద్దేందుకు అమిత్ షాను లక్నోకు పంపుతున్నారు.ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాలు వృథా అయ్యాయ‌నే భావ‌న ప్రజ‌ల్లో ఉంది. స‌మావేశాల‌ను స‌మ‌ర్థవంతంగా నిర్వహించ‌డంలో మోడీ విఫ‌ల‌మ‌య్యార‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాద‌ని చెప్పిన త‌ర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్డీయే నుంచి ప్రధాన మిత్రపక్షం టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అనంత‌రం వైసీపీ, టీడీపీలు ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ‌పెట్టేందుకు ప్రయ‌త్నం చేశారు.రోజూ ఆయా పార్టీలు స్పీక‌ర్‌కు అవిశ్వాస తీర్మానాలు అందించడం, కావేరి జ‌ల‌బోర్డు ఏర్పాటు చేయాల‌ని అన్నాడీఎంకే, రిజ‌ర్వేష‌న్ల అమ‌లు అధికారం రాష్ట్రాల‌కే ఇవ్వాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళ‌న‌లు చేయ‌డం.. స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేయ‌డం.. ఈ స‌మావేశాల్లో రెండు స‌భ‌ల్లోనూ ఇదే సీన్ త‌ప్ప మ‌రొక‌టి క‌నిపించ‌లేదు ప్రజ‌ల‌కు. మోడీ మాత్రం చూస్తూ ఉండి పోయారు త‌ప్ప ఆందోళ‌న చేస్తున్న వారిని పిలిచిమాట్లాడలేదు. క‌నీసం స‌మాధానం చెప్పలేదు. అవిశ్వాసానికి భ‌య‌ప‌డి పారిపోయార‌నే అప‌వాదును మోడీ-షా ద్వయం మూట‌గ‌ట్టుకుంది.ఇక రాజ‌స్థాన్‌లోనూ రెండు సిట్టింగ్ ఎంపీ సీట్లు కోల్పోయిన బీజేపీ, బిహార్‌లో నితీష్‌తో జ‌త క‌ట్టినా అక్కడ అరారియా లోక్‌స‌భ సీటులో ఓడింది. ఇక ప్రస్తుతం ఎన్నిక‌లు జ‌రుగుత‌న్న క‌ర్ణాట‌క‌లో ఏటికి ఎదురీదుతోంది. త్వర‌లో ఎన్నిక‌లు జ‌రిగే రాజ‌స్థాన్‌, మ‌ధ్యప్రదేశ్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోనూ ఆ పార్టీ గెలుపు క‌ష్టమే అని జాతీయ రాజ‌కీయ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇటు న‌మ్మక‌మైన మిత్రప‌క్షాలు దూర‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప‌లు మిత్రప‌క్షాలు మోడీని ప్రత్యక్షంగా విమ‌ర్శించ‌డం.. బీజేపీ వ్యతిరేక కూట‌మి ఏర్పాటుకు స‌న్నాహాలు జ‌రుగుతుండ‌డం మోడీ-షాల ద్వయం ప్రాభ‌వం కోల్పోతుంద‌న‌డానికి నిద‌ర్శన‌మ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

Related Posts