YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

ఎస్ ఐ డిపార్ట్ మెంట్ పరువు తీశాడు

ఎస్ ఐ డిపార్ట్ మెంట్ పరువు తీశాడు

ఎస్ ఐ డిపార్ట్ మెంట్ పరువు తీశాడు
చెన్నై, జూన్ 27
ఇటీవల కాలంలో టిక్‌టాక్ యాప్ బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే దాని కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారు, జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు కూడా భారీగానే ఉన్నారు. మొదట టైమ్‌పాస్‌గా మొదలవుతున్న ఈ అలవాటు తర్వాత వ్యసనంగా మారుతోంది. అనేక మంది ప్రభుత్వోద్యోగులు సైతం విధుల్లో ఉండగా టిక్‌టాక్ వీడియోలు చేస్తూ ఉద్యోగాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాలు, హత్యలకు కూడా ఈ యాప్ కారణమవుతోంది. తమిళనాడులోని చెన్నై సెక్రటేరియట్ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కల్యాణ సుందరం(53) అనే ఎస్ఐ కూడా టిక్‌టాక్‌కు బానిసగా మారాడు. అనేక మంది మహిళతో డబుల్ మీనింగ్ డైలాగులకు, మసాలా పాటలకు యాక్షన్ చేస్తూ వాటిని టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేస్తూ పైశాచికానందం పొందుతున్నాడు.ఏడాదిగా అతడు వివాహితలు, యువతులతో టిక్‌టాక్ ద్వారా పరిచయాలు పెంచుకుని ఇలా పాటలు పాడటం, డ్యాన్సులు చేస్తూ వీడియోలు తీసుకుని వాటిని టిక్‌టాక్‌ యాప్‌లో పోస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం చెన్నైలో రోజులకు 2వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటంతో పోలీసు శాఖలో కలవరం మొదలైంది. ఈ సమయంలోనూ అతడు స్టేషన్‌లో వీడియోలు తీస్తూ రోజుకు కనీసం 20పైకి పోస్టులు చేస్తున్నాడు. విధుల్లో ఉంటూనే నిత్యం సెల్‌ఫోన్‌తోనే గడుపుతుంటాడని తోటి ఉద్యోగులు చెబుతున్నాడు. పోలీసు శాఖకే కళంకం తెచ్చే ఇలాంటి ఉద్యోగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Posts