కేంద్రమంత్రులతో రఘురామకృష్ణంరాజు భేటీ
న్యూఢిల్లీ జూన్ 27
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు శనివారం నాడు కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. ఆయన శుక్రవారం నాడు లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను, ఎన్నికల కమిషన్ అధికారులను కలిసిన విషం తెలిసిందే. బీజేపీ నేతలతో చర్చలు జరుపుతూ గతంలోనూ ఆయన చాలా సార్లు వార్తల్లోకెక్కారు. రాజ్నాథ్తో ఆయన షోకాజ్ నోటీసుపై చర్చించారు. తరువాత అయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిసారు. తనకు వైసీపీ జారీ చేసిన షోకాజు నోటీసు చెల్లుబాటు కాదని, దానిపై ఏపీ సీఎం జగన్ సంతకం లేదని ఆయన అంటున్నారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదైన వైసీపీ అసలు పేరు, తనకు షోకాజు నోటీసుల్లో ఉన్న పార్టీ పేరు మధ్య కూడా వ్యత్యాసంపై ఉన్నట్లు ఆయన ఈసీకి కూడా వివరించారు. తమ పార్టీలో క్రమశిక్షణ కమిటీ లేదని, తనపై చర్యలు ఎలా తీసుకుంటారాని ఆయన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ నేతలను కూడా కలుస్తుండడం ఆసక్తి రేపుతోంది.