శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ సీఎం శివరాజ్ చౌహాన్
తిరుమల జూన్ 27
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం నాడు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తరువాత అయన మీట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. కరోనా మహమ్మారి నుంచి మన దేశం విముక్తి పొందాలని శ్రీవారిని ప్రార్ధించానని అన్నారు. సుందరకాండ పారాయణంలో పాల్గొని ఇదే కోరుకున్నాను . ప్రధాని మోదీ నేతృత్వంలో కరోనా పై బలంగా పోరాడుతున్నాం . దేశ రక్షణ కోసం సరిహద్దులో చైనా పై మన సైనికులు గట్టి జవాబు ఇచ్చారని అన్నారు. మన జవాన్లు చేస్తున్న పోరాటానికి మరింత శక్తిని చేకూర్చాలని శ్రీవారిని ప్రార్ధించాను. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ పోరాటాలు అన్నిటిలో భారత్ విజయం సాధించనుందని అయన అన్నారు.