నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి
న్యూఢిల్లీ జూన్ 27
నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎంపీ రఘ రామకృష్ణంరాజు అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర సహాయమంత్రిని కలిసి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ మరోసారి విజ్ఞప్తి చేశాను. ఎలక్షన్ కమిషన్ ని కలిసి పార్టీలకు నియమనిబంధనలను అడిగి తెలుసుకున్నా. ముఖ్యమంత్రి కి ఏవిధంగా సమాధానం ఇవ్వాలనే దానిపై న్యాయ నిపుణుల సూచనలు తీసుకుంటున్నా. క్రమశిక్షణ కలిగినా కార్యకర్తనని అయన అన్నారు. పార్టీని, ముఖ్యమంత్రి ని ఎప్పుడు వ్యతిరేకించలేదు, వ్యతిరేకించబోను. ప్రభుత్వానికి ఒకటిరెండు అంశాల్లో సూచనలు మాత్రమే చేసాను. 80 శాతం ఉన్న భక్తుల మనోభావాలను వ్యతిరేకంగా తిరుపతి భూముల అమ్మకానికి వెళ్లడం సరికాదని సూచించాను. ప్రభుత్వానికి నేను చేసింది సూచనలే, విమర్శలు కాదు. నాపై తప్పుడు వార్తలు ప్రచురిస్తూ అవాస్తవలను ప్రచారం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి ని కలిసే అవకాశం వస్తుందని అనుకోవట్లేదు. ముఖ్యమంత్రి చాలా బిజీగా గడుపుతున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ అడిగాను.. ఇస్తే కలిసి అన్ని వివరిస్తాను... లేకపోతే సవివరంగా మెయిల్ పంపుతాను. సోమవారం కలిసేందుకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా కలిసి నా వర్షన్ వినిపిస్తా. పార్టీ అధ్యక్షుడికి నాకు మధ్య అఘాతం సృష్టించేలా కొందరు వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగబద్దంగా జరిగిన చర్చలో పాల్గొన్నందుకు నాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదు. నాకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని అయన అన్నారు.