YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 బకాయిల తెలంగాణగా మార్చేశారు : బీజేపీ

 బకాయిల తెలంగాణగా మార్చేశారు : బీజేపీ

 బకాయిల తెలంగాణగా మార్చేశారు : బీజేపీ
హైద్రాబాద్, జూన్ 27
తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘‘బంగారు తెలంగాణ కాస్త.. బకాయిల తెలంగాణగా మారే.. మాటల గారడీతో కాలం గడపడం, ప్రజావ్యతిరేక పాలన, అవినీతితో డబ్బులు పోగేసుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ నైజం’’ అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. 17 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను.. రూ.3 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చేశారంటూ ఫైరయ్యింది.జూన్ 25న మెదక్ జిల్లా నర్సాపూర్‌లో హరిత హారం ఆరో దశను ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనన్నారు. రైతు బంధు ఇవ్వడానికే లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగుల జీతాల్లో కోత విధించామన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు తొలగించడంతో కొద్ది రోజుల వ్యవధిలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైందన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ ఎలా అప్పుల పాలైందనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణపై రూ.70 వేల కోట్ల అప్పుల భారం ఉండగా.. ప్రస్తుతం అది రూ.2.90 లక్షల కోట్లకు చేరింది. ఆరేళ్లలోనే రుణ భారం నాలుగున్నర రెట్లు పెరిగింది. ప్రభుత్వం గతేడాది వడ్డీల కోసం రూ.13 వేల కోట్లు చెల్లించగా.. ఈ ఏడాది రూ.14,600 కోట్లను చెల్లించింది.

Related Posts