పెద్దగూడెం కల నెరవేరింది
- మాట ఇచ్చా .. నిలబెట్టుకుంటున్నా మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి జూన్ 29 వనపర్తి జిల్లా పెద్దగూడెంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు హజరయ్యారు. మంత్రి వైకుంఠధామం ప్రారంభించి, ఖాన్ చెరువుకు నీళ్లు నింపే లిఫ్ట్ పనులకు భూమిపూజ చేసారు. మంత్రి మాట్లాడుతూ పెద్దగూడెం కల నెరవేరింది. మాట ఇచ్చా .. నిలబెట్టుకుంటున్నానని అన్నారు. 1500 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. దాదాపు 400 మంది రైతులకు ప్రయోజనం కలుగుతోంది. రూ.79 లక్షలతో 120 హెచ్ పీ మోటారుతో ఖాన్ చెరువు నింపేందుకు లిఫ్ట్ ఏర్పాటు చేసాం. ఖాన్ చెరువు నింపి రాములవారి పాదాలు కడుగుతా. విపక్ష నేతలు ఫిర్యాదులతో నీళ్లు రాకుండా అడ్డుకున్నారు. అన్ని అనుమతుల కోసం ఎదురుచూస్తే రైతులు నష్టపోతున్నారు. అందుకే పయోనీర్ విత్తన సంస్థను సామాజిక బాధ్యత నిధులతో రైతులకు మేలు చేసే ఈ లిఫ్ట్ చేపట్టాలని కోరాను. వారు ముందుకు వచ్చి లిఫ్ట్ నిర్మిస్తున్నారు. లిఫ్ట్ నిర్వహణకు గ్రామంలో ఒక కమిటీ ని ఎన్నుకోండి. నియోజకవర్గంలో దాదాపు 40 ఈ తరహా చిన్న పెద్ద లిఫ్టులు చేపట్టడం జరిగింది. సాగుకు యోగ్యమయ్యే ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తాం. రైతుల శ్రేయస్సే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. అందుకే వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ రైతులను ప్రోత్సహించే ఇన్ని పథకాలు లేవని మంత్రి అన్నారు. రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు, సాగునీటి రాకతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని అయన అన్నారు.