YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

న‌దిలో ఓ ప‌డ‌వ మునిగి 23 మంది మృతి

న‌దిలో ఓ ప‌డ‌వ మునిగి 23 మంది మృతి

న‌దిలో ఓ ప‌డ‌వ మునిగి 23 మంది మృతి
ఢాకా జూన్ 29  
బంగ్లాదేశ్ లోని బురిగంగా న‌దిలో ఓ ప‌డ‌వ మునిగిపోయింది. ఈ ప్ర‌మాదంలో ప‌డ‌వ‌లో ప్ర‌యాణిస్తున్న 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్నింగ్ బ‌ర్డ్ అనే ప‌డ‌వ‌.. మున్షిగంజ్ నుంచి స‌ద‌ర్ ఘాట్ వైపు వెళ్తున్న స‌మ‌యంలో మౌయురి-2 అనే నౌక‌ను ఢీకొట్టింది. దీంతో ప‌డ‌వ నీటిలో మునిగింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌డ‌వ‌లో మొత్తం 50 మంది ఉన్నారు. అయితే మృతుల్లో ముగ్గురు పిల్ల‌లు, ఆరుగురు మ‌హిళ‌లు ఉన్నారు. కొంద‌రు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, డైవ‌ర్లు స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. మృత‌దేహాల‌ను వెలికితీసే ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. 

Related Posts