YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

గంజాయి మత్తులో యువత

గంజాయి మత్తులో యువత

గంజాయి మత్తులో యువత
భద్రాద్రి జూన్ 29
రోజు రోజుకి యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. కొంతమంది అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని ధ్యేయంతో గంజాయిని యువతకు అంటగట్టే పనికి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాసుల కక్కుర్తి కి గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురి తో పాటు 16 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి.గంజాయిని 20 సంవత్సరాల లోపు పిల్లలే  సేవిస్తున్నట్లు వెల్లడైంది. ఇల్లందు సీఐ వేణు చందర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయ్ నీ అక్రమంగా అమ్ముతున్నారని సమాచారంతో సి ఐ,ఎస్ ఐ లు వెళ్లగా పాసి లీల ఎల్ బి ఎస్ నగర్, నునావత్ జ్యోతి కరెంట్ ఆఫీస్, పాసి అనే వ్యక్తి ముగ్గురు కలిసి రెండు కేజీల గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్ లు గా తయారుచేసి యువకులకు అలవాటు చేస్తున్నారని అన్నారు, ఈ ముగ్గురి పై గతంలోనే కేసులు ఉన్నాయని చెప్పారు. అందరిని కస్టడీకి తరలిస్తున్నామని అన్నారు.

Related Posts