YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

భీమవరంలో ఉద్రిక్తత

భీమవరంలో ఉద్రిక్తత

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గురువార ఉదయం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ను ప్రతిపక్షాలు స్తంభింపజేసినందుకు నిరసనగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు నిర్వహిస్తున్న దీక్షకు మద్దతుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎక్కడికక్కడే దీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే... నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దీక్ష నిర్వహిస్తున్నారు.అయన నిరసన దీక్ష శిబిరానికి ఎదురుగా సీపీఎం, వైయస్సార్ పార్టీ  నేతలు చేరి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.  దాంతో బీజేపీ కార్యకర్తలు ఎదురు నినాదాలు చేయడంతో పరిస్తితి ఒక్కసారిగా వేడేక్కింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని వామపక్ష నేతలు నినాదాలు చేసారు. ఇప్పుడు దొంగ దీక్షలతో  కొత్త నాటకానికి తెర తీశారని విరుచుకపడ్డారు. ఇరువైపున నినాదాలు అధికం కావడంతో పాటు బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని కార్యకర్తలను చెదరగొట్టారు.

Related Posts