YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భయపెడుతున్న కరోనా

భయపెడుతున్న కరోనా

భయపెడుతున్న కరోనా
న్యూఢిల్లీ, జూన్ 30,
భారత్ కరోనా నుంచి బయట పడటం కష్టమే. ఎందుకంటే రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇది దేశ వ్యాప్తంగా ఆందోళన కల్గిస్తుంది. లాక్ డౌన్ అమలు చేసినంతవరకూ కంట్రోల్ లో ఉన్న కరోనా మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య ఆగడం లేదు. రోజుకు పదిహేను వేలు నుంచి పదిహేడు వేల వరకూ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఇప్పటికే దేశ వ్యాప్తంగా పదహారువేలు దాటింది.కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో భారత్ విజయవంతమయిందని తొలినాళ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అంతర్జాతీయ మీడియా సయితం ప్రశంసలు కురిపించింది. లాక్ డౌన్ నుంచి ఎలా ఎగ్జిట్ అవుతారోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసింది. అయితే మూడో విడత లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తూ ప్రధాని మోదీ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నాన్ని మొదలు పెట్టారు.కానీ లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య మరిన్ని పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ లో ఐదు లక్షల కరోనా పాజటివ్ కేసులు దాటాయి. దీనికి కారణం ప్రభుత్వాల వైఖరి ఒక కారణంకాగా, ప్రజల అజాగ్రత్త కూడా మరో కారణమని చెప్పక తప్పదు. కరోనా విజృంభిస్తున్నా ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్ లు ధరించకపోవడం వంటి వాటి వల్ల కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి.అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం లేదు. ఎక్కడిక్కడ కేసుల సంఖ్యను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలే లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకోవాలని చెబుతోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ను విధించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని చెబుతోంది. భారత్ లో కూడా కేసుల సంఖ్య పదిహేను లక్షలు దాటుతాయన్న లెక్కలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసింది. ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు దేశంలో ఉంది.శ వ్యాప్తంగా కంటిన్యూ చేయకపోయినా కొన్ని రాష్ట్రాలు మాత్రం వాటంతట అవే లాక్ డౌన్ ను ప్రకటించుకున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు జులై 31వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా అదే బాటన పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నాయి.జార్ఖండ్ రాష్ట్రంలోనూ లాక్ డౌన్ ఆంక్షలను జులై 31వ తేదీ వరకూ పొడిగించారు. కొన్ని రాష్ట్రాలు అంతరాష్ట్ర ప్రయాణాలపై నేటికి నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణల మధ్య రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు. అసోం రాష్ట్రం కూడా జులై 12 వరకూ లాక్ డౌన్ ను విధించారు. మణిపూర్ లో జులై 15వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించాలని దాదాపుగా నిర్ణయించింది. ఇలా దేశ వ్యాప్తంగా ఆరోవిడత లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా.. ప్రకటించకున్నా రాష్ట్రాలు మాత్రం తీవ్రతను బట్టి లాక్ డౌన్ ను ప్రకటిస్తుండటం విశేషం.
 

Related Posts