YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో బీజేపీ దీక్షా శిబిరం వద్ద గందరగోళం

విశాఖలో బీజేపీ దీక్షా శిబిరం వద్ద గందరగోళం

విశాఖ లో బీజేపీ ఉపవాస దీక్షలు ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ దీక్షకు వ్యతిరేకంగా సీపీఐ ర్యాలీ నిర్వహించింది. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా సీపీఐ, వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. గురువారం నాడు విశాఖ ప్రభుత్వ కళాశాల ముందు దీక్ష చేపట్టిన ఎంపీ హరిబాబుకు వ్యతిరేకంగా సీపీఐ కార్యకర్తలు నినాదాలు చేసారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కపట దీక్షలు చేయటం ఏంటంటూ వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో  సీపీఐ, బీజేపీ కార్యకర్తల మధ్య మాటమాట తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది. పరస్పరం దాడులకు దిగిచ ఒకరిపూ మరొకరు చెప్పులు విసురుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు

Related Posts