ఎమ్మెల్సీ పదవికి పిల్లి రాజీనామా
విజయవాడ
ఎమ్మెల్సీ పదవికి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిని కలిసి మంత్రి పదవికీ రాజీనామా సమర్పించబోతున్నారు. మంత్రిగా ఏడాది కాలం సంతృప్తిగా పనిచేశానన్న బోస్ ....పార్లమెంటుకు వెళ్లాలన్నది తన చిరకాల కోరిక అని వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదేమోనన్న బోస్ ....వస్తుందన్న నమ్మకం తనకైతే లేదని తేల్చిచెప్పారు