రిలయన్స్ భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నెల్లూరు
కృష్ణపట్నం ఎన్నో పరిశ్రమలకు అం కేంద్రంగా మారింది . కానీ రిలయెన్స్ కు కేటాయించిన భూములు మాత్రం నిరుపయోగంగానే ఉన్నాయి. ఇక్కడ అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్టు పెట్టాలని ఆ సంస్థ ప్రయత్నించింది. అయితే ఎందుకనో ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సుమారు రెండు వేల ఎకరాలకు పైగా భూములు నిరుపయోగంగా ఉన్నాయి .రిలయన్స్ సంస్థ తన కార్యాలయాన్ని ఇతర కొన్ని గోదాములను ఇక్కడ ఏర్పాటు చేసింది.అయితే ఈ భూములు నిరుపయోగంగా ఉన్న కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు పరిశీలించారు .అయితే ఇక్కడ వేరే పరిశ్రమ వస్తుందా లేదా, భూములను వెనక్కి తీసుకుంటారన్నది సమాచారం ప్రశ్నార్ధకం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా అధికారులు తగిన నిర్ణయం తీసుకోనున్నారు.