YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టోల్ ప్లాజాల దగ్గర రద్దీ

టోల్ ప్లాజాల దగ్గర రద్దీ

టోల్ ప్లాజాల దగ్గర రద్దీ
యాదాద్రి భువనగిరి 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మారు హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ విదిస్తారనే వార్తల నేపథ్యంలో  యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద  బుధవారం ఉదయం నుండి వాహనాల రద్దీ పెరిగింది. మరోమారు లాక్ డౌన్ విధిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యం తో బతుకు దేరువు కోసం జి హెచ్ ఎం సి పరిధిలో స్థిరపడిన ప్రజలు హైదరాబాద్ నుండి స్వంత ఊర్లకు బయలు దేరుతున్నారు.  దీని తో హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి పై ఉన్న గూడూరు టోల్ ప్లాజా ల వద్ద రద్దీ పెరిగిందని, టోల్ సిబ్బంది అంటున్నారు. రద్దీకి తగ్గట్టు గా టోల్ ప్లాజా సిబ్బంది వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాలు నేరుగా వెళ్తున్నపటికీ, డబ్బులు చెల్లించి వెళ్లే వాహనదారులు వరుసలో వేచి చూడాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ వైపు మొగ్గు చూపితే సాయంత్రం వరకు వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టోల్ సిబ్బంది భావిస్తున్నారు.

Related Posts