ముదిరిన బొత్స భూ వివాదం
విజయనగరం
పట్టణంలోని ప్రదీప్ నగర్లో బొత్స భూ వివాదం మరింత ముదిరింది. సర్వే నెంబరు 53లో పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబీకుల నుంచి కొనుగోలు చేసిన తమ భూమిలోని ఆస్తులు ధ్వంసం చేశారని మంత్రి బొత్స సోదరుడు ఆదినారాయణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాలుగు ఎకరాల భూమి రైల్వే ఉద్యోగుల సంఘం నుంచి కొనుగోలు చేశామని, ఆ భూమి కూడా తమదేనని పలువురు ఆందోళనకారులు పట్టుబడుతున్నారన్నారు. కాగా.. భూ వివాదం కోర్టులో ఉన్నపుడు మంత్రి బొత్స సోదరుడు కంచె ఎలా నిర్మిస్తారని బాధితులు వాపోతున్నారు.