YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ పాలన చూసి కొత్త కంపెనీలు రావు..ఉన్న కంపెనీలను ఉండనివ్వరు:లోకేష్

జగన్ పాలన చూసి కొత్త కంపెనీలు రావు..ఉన్న కంపెనీలను ఉండనివ్వరు:లోకేష్

జగన్ పాలన చూసి కొత్త కంపెనీలు రావు..ఉన్న కంపెనీలను ఉండనివ్వరు:లోకేష్
అమరావతి 
టీడీపీ అధినేత చంద్రబాబు హయంలో ఏపీ బిజినెస్‌లో నంబర్ 1 స్థానంలో ఉందని ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. జగన్ పాలనలో తమ పార్టీలో చేరితే కండువా అని.. లేకుంటే వేధింపులని విమర్శించారు. జగన్ పాలన చూసి కొత్త కంపెనీలు రావని.. ఉన్నవాటిని ఆయన ఉండనివ్వరని లోకేష్ పేర్కొన్నారు.‘‘చంద్రబాబు గారి హయాంలో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ 1. జగన్ రెడ్డి రాజ్యంలో ఏపీ ఈజ్ ఆఫ్ కిల్లింగ్ బిజినెస్‌లో నెంబర్ 1. జగన్ రెడ్డి గారి పాలన చూసి రాష్ట్రానికి వచ్చే కంపెనీ లేదు. ఉన్న కంపెనీలను ఆయన ఉండనివ్వరు. పార్టీలో చేరితే కండువా.. లేకపోతే వేధింపులు. కక్ష సాధింపులో భాగంగానే అమర్ రాజాకి కేటాయించిన భూములు వెనక్కి తీసుకున్నారు. 22 మంది ఎంపీలు ఉన్నా సాధించింది శూన్యం. టీడీపీ ఎంపీలు ముగ్గురైనా ప్రత్యేకహోదా దగ్గర నుంచి రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో  పోరాడుతున్న తీరుని జీర్ణించుకోలేకే ఎంపీ గల్లా జయదేవ్ గారిపై ఇటువంటి చర్యలకు పూనుకున్నారు’’ అని లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related Posts