YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

శరద్ పవార్‌ కు తృటిలో తప్పిన ప్రమాదం

 శరద్ పవార్‌ కు తృటిలో తప్పిన ప్రమాదం

ముంబాయి జులై 01. ఎన్సీపీ నేత శరద్ పవార్‌ కు తృటటిలో రోడ్డు ప్రమాదం తప్పింది.  శరద్ పవార్‌కు చెందిన కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తా పడింది. ముంబై- పుణె మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్‌వే పై ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా వున్నాయి. ముంబై- పుణె మధ్య ఎక్స్‌ప్రెస్ వేపై శరద్‌పవార్ కాన్వాయ్‌లోని ఓ వాహనం తొలుత బోల్తా పడింది. అయితే అప్పటికే శరద్‌పవార్ వాహనం దాటి వెళ్లడంతో.. ఆయనకు ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ జీపు రోడ్డుపై బోల్తా కొట్టింది. ఆ జీపులోని డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు పుణే జిల్లా రూరల్ పోలీసులు తెలిపారు.  సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Related Posts